తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను తక్కువ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు” అని స్పష్టం చేస్తూ, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన యోధుడిని ఒక తండ్రి సమానుడిగా గౌరవించాల్సింది పోయి, ఇష్టానుసారంగా మాట్లాడటం రేవంత్ అవివేకమని హరీష్ విమర్శించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కేసీఆర్ నిలబెట్టారని, అటువంటి నాయకుడిపై విమర్శలు చేయడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆయన ఆరోపించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వీధి రౌడీలా మాట్లాడటం రేవంత్ రెడ్డి సంస్కారానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Dhurandhar box office : 600 కోట్ల క్లబ్లో ధురంధర్.. వంగా రికార్డు బ్రేక్!
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని తూర్పారబడుతూ హరీష్ రావు పలు సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి పార్టీలు మారడం, సీట్లు కొనుగోలు చేయడం, చిల్లర రాజకీయాలు చేయడం అలవాటని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యంగా అధికారంలో ఉంటూ కమీషన్లు దండుకోవడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. రేవంత్ గతంలో చేసిన పనులను గుర్తు చేస్తూ.. ఆయన మాటల తీరు, ప్రవర్తన ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తున్నాయని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి భాష కేవలం రాజకీయ పతనాన్ని సూచిస్తుందని, ఆయన నైతికత లేని నాయకుడని హరీష్ రావు ఘాటుగా విమర్శించారు.

ముఖ్యమంత్రిపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు అత్యంత తీవ్రంగా ఉన్నాయి. “చెట్టుకు కట్టేసి కొరడాతో కొట్టినా తక్కువే” అనే రీతిలో ఆయన చేసిన ప్రసంగం ఉభయ పార్టీల మధ్య పెరిగిన శతృత్వానికి నిదర్శనంగా నిలిచింది. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే రేవంత్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, పాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా దూషించడం రేవంత్ బలహీనతకు నిదర్శనమని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరింత రాజకీయ వేడిని పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com