📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Heroins Phones : హీరోయిన్ల ఫోన్లను రేవంత్ రెడ్డి హ్యాక్ చేయిస్తున్నారు – పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Author Icon By Sudheer
Updated: July 25, 2025 • 7:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపిస్తూ, రేవంత్ రెడ్డి హద్దు మీరిపోయారని అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని పేర్కొన్నారు.

హీరోయిన్ల ఫోన్లకూ హ్యాకింగ్

రేవంత్ రెడ్డి ప్రైవేట్ హ్యాకర్లతో కలిసి సినీ పరిశ్రమలోని పలువురి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయిస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మైహోంభుజాలో ఏ హీరోయిన్‌ను కలిశావో మాకు తెలుసని, నీవు తిరిగిన 16 మంది వివరాలు మాకు లభించాయని అన్నారు. తన ఫోన్ హ్యాక్ చేస్తున్నారనే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని చెప్పారు. అంతేగాక, తన భార్య ఫోన్ కూడా హ్యాక్ చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే ఈడీ, సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

కేబినెట్ రద్దుకు కారణం

ఈరోజు జరగాల్సిన కేబినెట్ సమావేశం రద్దయిందని, దీనికీ కారణం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమేనని కౌశిక్ రెడ్డి తెలిపారు. మంత్రులంతా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఫిర్యాదు చేయనున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ పెద్దలు కూడా రేవంత్ reddyపై అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ట్యాపింగ్ వ్యవహారంపై స్పష్టత వచ్చే వరకు కేబినెట్ సమావేశాలకు మంత్రులు హాజరుకాలేమని చెప్పారని వివరించారు.

Read Also : Heavy Rains : తెలంగాణ ప్రజలకు IMD వార్నింగ్.!

cm revanth padi kaushik

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.