Breaking News – CM Revanth : రేవంత్.. ఇంతకన్నా చేతకానితనం ఉంటుందా..? కేటీఆర్

Read Time:  1 min
Latest News
Latest News
FONT SIZE
GET APP

తెలంగాణలో చోటుచేసుకున్న SLBC టన్నెల్ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురి మృతదేహాలను ఇప్పటివరకు బయటకు తీయలేకపోవడం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యమని ఆయన మండిపడ్డారు. బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్న సమయంలో, ప్రభుత్వం మాత్రం సీరియస్‌గా వ్యవహరించకపోవడం విచారకరమని పేర్కొన్నారు.

హైదరాబాదు నాలా ఘటన

కేటీఆర్ (KTR) తన విమర్శల్లో హైదరాబాద్‌లో నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురు వ్యక్తుల సంఘటనను కూడా ప్రస్తావించారు. మూడు రోజులు గడిచినా వారి డెడ్ బాడీలను గుర్తించలేకపోవడం ఎంతటి నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ పని చేస్తోందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబాల ఆవేదన

‘తమ ఆప్తులను కనీసం చివరి చూపు చూసుకోలేని పరిస్థితి ఎంత భయంకరమో బాధిత కుటుంబాల ఆవేదనలో కనిపిస్తోంది. ఆ బాధను ప్రభుత్వం వినిపించడం లేదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టమని ఆయన విమర్శించారు.

https://vaartha.com/indigo-flight-travel-for-the-price-of-a-bus-ticket/business/548214/

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.