Latest Telugu News : RB Uday Kumar : నటుడు విజయ్‌కి అన్నాడీఎంకే సీనియర్‌ నేత కీలక సూచనలు

Read Time:  1 min
RB Uday Kumar
RB Uday Kumar
FONT SIZE
GET APP

తమిళనాడులో రాజకీయాల్లో ప్రవేశించిన ప్రముఖ నటుడు విజయ్‌కి అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్ (RB Uday Kumar) కీలక సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన రాజకీయ పొరపాటును పునరావృతం చేయవద్దని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరహాలో సరైన సమయంలో పొత్తులపై నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు.అన్నా డీఎంకే కూటమిలో చేరకపోతే విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాజకీయంగా కనుమరుగవడం ఖాయమని ఉదయ్‌కుమార్‌ (RB Uday Kumar) హెచ్చరించారు. మధురైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఉదయకుమార్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.

Read Also: President:తృటిలో ప్రమాదం నుంచి తప్పిచ్చుకున్న ద్రౌపదీ ముర్ము

RB Uday Kumar
RB Uday Kumar

తమ కూటమిలో చేరేందుకు మరిన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, ఇదే సమయంలో విజయ్ కూడా తమతో కలవాలని ఆహ్వానించారు. అన్నాడీఎంకే మెగా కూటమిలో టీవీకే చేరడానికి ఇదే సరైన సమయమని చెప్పారు. ఈ అవకాశాన్ని విజయ్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ కూటమిలో చేరకపోతే ఎన్నికల తర్వాత డీఎంకే ఆ పార్టీని నాశనం చేస్తుందని జోష్యం చెప్పారు. ఒంటరిగా బరిలో దిగితే టీవీకే అడ్రస్ లేకుండా పోతుందని ఉదయకుమార్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు పొత్తులపై సరైన నిర్ణయం తీసుకోలేకపోయారని, కానీ పవన్ కల్యాణ్ సరైన సమయంలో సరైన పొత్తు నిర్ణయంతో పార్టీని నిలబెట్టుకోవడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. తన మాటను విజయ్‌ గుర్తుపెట్టుకోవాలని, డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తే విజయ్‌ను దేవుడు కూడా కాపాడలేడని ఉదయ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.

ఉదయకుమార్ ఎవరు?

ఆర్.బి. ఉదయ కుమార్ ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష ఉప నాయకుడు. ఆయన తిరుమంగళం నియోజకవర్గం నుండి తమిళనాడు శాసనసభ సభ్యుడు.

ఉదయకుమార్ రాజకీయ జీవితం?

జూలై 17, 2022న, AIADMK శాసనసభా పక్ష సమావేశంలో O. పన్నీర్‌సెల్వం స్థానంలో R. B. ఉదయ కుమార్‌ను తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా ఎన్నుకున్నారు. దీనిని జూలై 19, 2022న అధికారికంగా ప్రకటించారు. AIADMK దాదాపు 19 నెలల డిమాండ్ తర్వాత, ఫిబ్రవరి 14, 2024న, స్పీకర్ M. అప్పావు పన్నీర్‌సెల్వం స్థానంలో తమిళనాడు అసెంబ్లీలో మొదటి వరుసలో ఉప ప్రతిపక్ష నాయకుడి స్థానాన్ని ఉదయకుమార్‌కు కేటాయించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.