తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో వరుస హిట్లతో ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక (Rashmika) మందన్న. కన్నడ సినిమా “కిర్రిక్ పార్టీ”తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టి, ఆ తర్వాత తెలుగులో “ఛలో”తో భారీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందింది. “గీతా గోవిందం”, “సరిలేరు నీకెవ్వరు”, “భీష్మ”, “డియర్ కామ్రేడ్”, “పుష్ప: ది రైజ్”, “సీతారామమ్”, “వారసుడు”, “యానిమల్” సినిమాలతో టాలీవుడ్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించింది. బాక్సాఫీస్ వద్ద 3000 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించడంతోనే కాకుండా నటిగా, అందగత్తిగా రష్మిక రాణిస్తుంది.
జాతీయ స్థాయిలు గుర్తింపు
రష్మికకి “యానిమల్” (సందీప్ రెడ్డి వంగ–రణబీర్ కపూర్), “పుష్ప 2: ది రూల్” (సుకుమార్–అల్లు అర్జున్) వంటి భారీ హిట్లు దక్కించాయి. బాలీవుడ్లో విక్కీ కౌశల్తో “ఛావా”లోనూ అద్భుతమైన నటన ప్రదర్శించింది. అలాగే “సికిందర్” సినిమాలో సల్మాన్ ఖాన్తో కలసి నటించి బాలీవుడ్లో తన గుర్తింపు మరింత పెంచుకుంది. ఈ జాతీయ స్థాయిలో పొందిన విజయాలతో రష్మిక ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది.
రష్మిక జీవితంలో ఒత్తిళ్లు, సవాళ్లు
కానీ ఇంత భారీ విజయాల వెనుక రష్మిక జీవితంలో తగినంత ఒత్తిళ్లు, సవాళ్లు ఎదుర్కొన్నట్లు తాజా ఇంటర్వ్యూలో అందరితో పంచుకుంది. చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు కూడా భయాలు, అపనిందనలు, నిరాశలు ఎదురైనా, అవి శాశ్వతం కాదని, ఎప్పుడైనా సవాళ్లను అధిగమించాలని పేర్కొంది. ప్రస్తుతం “ధనుష్ సరసన నటిస్తున్న ‘కుబేరా’ (జూన్ 20న రిలీజ్), “ది గర్ల్ఫ్రెండ్”, “థామా” వంటి చిత్రాలతో బిజీగా ఉంది.
Read Also : Ukraine attack : రష్యాపై ఉక్రెయిన్ దాడి.. 40కి పైగా విమానాలు ధ్వంసం!