టాలీవుడ్లో నటించే హీరోయిన్లకు గౌరవం ఎక్కువగా ఉంటుందని హీరోయిన్ రాశీ ఖన్నా(Rashikhanna) తెలిపారు. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తాను అనుభవించిన అనుభూతులను పంచుకున్నారు. “టాలీవుడ్లో నటీనటుల మధ్య చాలా స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లకు చాలా గౌరవం ఇస్తారు. అక్కడ పని చేస్తుంటే ఎప్పుడూ ఒక కుటుంబంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది” అని ఆమె వెల్లడించారు.
Latest News: Bigg Boos 9: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే?
రాశీ ఖన్నా మాట్లాడుతూ, “హిందీ, తమిళ ఇండస్ట్రీల్లో రోజుకు కనీసం 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. దీని వల్ల బాగా అలసిపోతాం. కానీ టాలీవుడ్లో పని పద్ధతులు క్రమబద్ధంగా ఉంటాయి. విశ్రాంతి సమయాలు కూడా ఇస్తారు. అందుకే నాకు టాలీవుడ్లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంటుంది” అని వివరించారు. అలాగే తనను అభిమానించే వారు తెలుగులోనే ఎక్కువగా ఉన్నారని, ఇక్కడే తనకు ఎక్కువ ప్రేమ లభిస్తోందని పేర్కొన్నారు.
సిద్ధూ జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)తో కలిసి రాశీ ఖన్నా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’ ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. రాశీ ఖన్నా గ్లామర్, నటన, సిద్ధూ జొన్నలగడ్డతో ఆమె కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా విజయం రాశీ ఖన్నా కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.