📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news: Railway employees – రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రమాద బీమా

Author Icon By Sudha
Updated: September 2, 2025 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రైల్వే ఉద్యోగులకు (Railway employees) భారతీయ రైల్వేస్‌ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, వారి కుటుంబాలకు భారీ మొత్తంలో బీమా రక్షణ (accidental death cover) కల్పించింది. ఈ మేరకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సమక్షంలో దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.

Railway employees – రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రమాద బీమా

రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్‌ ఉన్న ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.కోటి ప్రమాద బీమా కవరేజీని పొందనున్నారు. అంతేకాదు ఎస్‌బీఐ శాలరీ ఖాతాలు కలిగిన రైల్వే ఉద్యోగులు రూ. 10 లక్షల సహజ మరణ బీమాకు కూడా అర్హులే. ఎటువంటి ప్రీమియం చెల్లింపులు లేదా వైద్య పరీక్షలు లేకుండా ఈ బీమా రైల్వే ఉద్యోగులకు(Railway employees) వర్తిస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. రైల్వేలో దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగులకు (Railway employees)జీతాలు ఎస్‌బీఐ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. వారందరికీ ఈ బీమా ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. ఈ అవగాహన ఒప్పందం రూ.కోటి ప్రమాద బీమా కవర్‌తోపాటు పలు బీమా రక్షణలను కూడా అందిస్తుంది. వీటిలో రూ.1.60 కోట్ల విమాన ప్రమాద మరణ కవరేజీ మొదలైనవి ఉన్నాయి. భారతీయ రైల్వేలకు వెన్నెముకగా ఉన్న శ్రామిక శక్తికి మద్దతు ఇచ్చేందుకే ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

రైల్వే ఉద్యోగులు ఎంత మంది?

ఆగస్టు 2024 నాటికి, బ్రాడ్-గేజ్ నెట్‌వర్క్‌లో 96.59% విద్యుదీకరణ చేయబడింది. 1.2 మిలియన్లకు పైగా ఉద్యోగులతో, ఇది ప్రపంచంలో తొమ్మిదవ అతిపెద్ద యజమాని మరియు భారతదేశంలో రెండవ అతిపెద్ద యజమాని.

అత్యధిక రైల్వేలు ఉన్న రాష్ట్రం ఏది?

దాదాపు 9,000 కి.మీ.ల విస్తృత రైల్వే నెట్‌వర్క్‌తో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, వారణాసి మరియు గోరఖ్‌పూర్ వంటి ప్రధాన రైల్వే జంక్షన్లు ఉన్నాయి, ఇవి కీలకమైన రవాణా కేంద్రాలుగా పనిచేస్తాయి.

భారతదేశంలో రోజుకు ఎన్ని రైళ్లు నడుస్తాయి?

భారతీయ రైల్వే ప్రతిరోజూ 13,169 ప్యాసింజర్ రైళ్లను నడుపుతుంది, ఇవి సుదూర మరియు సబర్బన్ మార్గాల్లో, భారతదేశం అంతటా 7,325 స్టేషన్లను కవర్ చేస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/spicejet-fined-heavily-for-14-hour-delay/national/539721/

accident insurance Breaking News Employee Benefits good news latest news railway employees Railway Safety Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.