ఎన్నికల సంఘం(EC)పై కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల అనంతరం కేవలం 45 రోజుల్లోనే ఎన్నికల డేటాను డిలీట్ చేయడంపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. “అంతకుముందు ఈ డేటా ఏడాది పాటు భద్రంగా ఉంచేవారు. ఇప్పుడు ఎందుకు తొలగిస్తున్నారు?” అని రాహుల్ ఎక్స్ (మాజీగా ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు. ఈ చర్యలు ఎన్నికల పారదర్శకతపై అనుమానాలు కలిగిస్తున్నాయని తెలిపారు.
“మ్యాచ్ ఫిక్స్ అయ్యింది” – తీవ్ర విమర్శలు
ఎన్నికల ప్రక్రియ ముందే నిర్ణయించినట్లుగా అనిపిస్తోందని రాహుల్ వ్యాఖ్యానించారు. “ఇది మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి వ్యవహారం. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నికలు ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ప్రమాదం” అని ఆయన హెచ్చరించారు. ప్రజల ఓట్ల విలువ కాపాడాలంటే, ఎన్నికల వ్యవస్థ పూర్తి పారదర్శకంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్ర రిగ్గింగ్ ఆరోపణల తరువాత కొనసాగింపు
ఇంతకుముందు మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని రాహుల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈసీపై మరోసారి ఎత్తుగడ వేసినట్లుగా రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. డేటా తత్వరగా తొలగించడంపై ఆయన చేసిన విమర్శలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసే అవకాశముంది. ప్రజాస్వామ్య విధానాల పట్ల అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
Read Also : Sitare Zameen Par: భారీ కలెక్షన్లు వసూలు చేసిన ఆమిర్ఖాన్ ‘సితారే జమీన్ పర్’