తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసే లక్ష్యంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ పేరిట 99 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండకూడదని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే, ఫైళ్ల క్లియరెన్స్ నిర్ణీత సమయంలో జరగాలని, జాప్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
Iran Defense Minister: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?
ఈ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా పెట్టుబడులు మరియు కంపెనీల ఒప్పందాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు క్షేత్రస్థాయిలో (Ground) అమలు కావాలని, కేవలం ఒప్పందాలకే పరిమితం కాకూడదని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనితో పాటు విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో అత్యాధునిక వసతులతో ‘తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు’ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ 99 రోజుల కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కొత్త బాటలు వేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :