తెలంగాణ రాష్ట్రంలో శనివారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం ఘటన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రమాదం తెచ్చిపెట్టే స్థితికి వెళ్లినప్పటికీ, సమయస్పూర్తితో స్పందించిన అధికారుల చురుకుదనంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన పాలకవర్గం, పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కలిగించినప్పటికీ, చివరికి ప్రమాదం లేకుండానే ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
భూ భారతి చట్టం అవగాహన సదస్సులో పాల్గొనడానికి మంత్రి పర్యటన
నాగర్కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించనున్న “భూ భారతి చట్టం – 2025” అవగాహన సదస్సు కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు సంపత్ కుమార్ హెలికాప్టర్ ద్వారా వెళ్లారు . ప్రజల్లో భూ చట్టంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. కలెక్టరేట్ ప్రాంగణంలో హెలికాప్టర్ ల్యాండింగ్ జరుగుతున్న సమయంలో అచట సెక్యూరిటీ సిబ్బంది భద్రతా చర్యలలో భాగంగా బుల్లెట్ ఫైర్ (సిగ్నల్ షాట్) చేశారనే సమాచారం. అయితే అది అక్కడి మైదానంలోని పొడి గడ్డిపైన పడి మంటలు రాజేసింది. హెలికాప్టర్ చాలా సమీపంలో ల్యాండ్ అవుతుండటంతో, ఈ మంటలు పెద్ద ప్రమాదాన్ని తెచ్చే అవకాశం ఉంది. అగ్ని ప్రమాదం తలెత్తగానే అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. కేవలం క్షణాల వ్యవధిలో చర్యలు తీసుకోవడం వల్ల భారీ ప్రమాదం నుంచి సీఎం క్యాబినెట్ మంత్రితో పాటు ఇతర అధికారులు తప్పించుకున్నారు.
Read also: Run for Jesus: హైదరాబాద్లో ఘనంగా కొనసాగిన రన్ ఫర్ జీసస్