📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభం

Author Icon By Sudheer
Updated: January 6, 2025 • 7:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్ నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా వర్చువల్ విధానంలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరానికి రైల్వే కూతవేటు దూరంలో మరింత హంగు తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పాల్గొననున్నారు.

రాష్ట్రంలోని రైల్వే ప్రయాణికుల అవసరాలను తీర్చడంలో చర్లపల్లి టర్మినల్ కీలక పాత్ర పోషించనుంది. అమృత్ భారత్ పథకంలో భాగంగా రూ.413 కోట్ల వ్యయంతో ఈ టర్మినల్ నిర్మించారు. పాశ్చాత్య దేశాల్లో కనిపించే స్థాయిలో అన్ని సౌకర్యాలు ఇందులో ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున రైళ్ల హాల్టింగ్, రైళ్ల నిర్వహణతో పాటు ప్రయాణికుల సేవలను మరింత మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ టర్మినల్ రూపుదిద్దుకుంది.

ఇప్పటి వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన కేంద్రంగా కొనసాగగా, చర్లపల్లి టర్మినల్ ప్రారంభంతో రైళ్ల హాల్టింగ్, పర్యవేక్షణ ఎక్కువగా ఇక్కడే జరుగనుంది. ఇది నగరంలోని రద్దీని తగ్గించడంలో కీలకంగా ఉంటుంది. ప్రయాణికులు కూడా ఈ కొత్త టర్మినల్ సౌకర్యాలను సులభంగా ఉపయోగించుకోవచ్చు.

ఈ టర్మినల్ ప్రారంభంతో చర్లపల్లి పరిసర ప్రాంతాల అభివృద్ధి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రైల్వే ఆధారిత ఆర్థిక కార్యకలాపాలు, ట్రాన్స్‌పోర్ట్ మౌలిక వసతులు మెరుగవుతాయి. ఇది స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను కూడా కల్పించనుంది.

ఈ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర, రాష్ట్ర నేతల సమాగమం జరుగుతున్న ఈ ప్రారంభోత్సవం రాష్ట్రాభివృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చర్లపల్లి టర్మినల్ తెలంగాణ ప్రజల రైల్వే ప్రయాణ అనుభవాలను మలుపుతిప్పే ప్రాజెక్టుగా నిలుస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.

Charlapalli New Terminal station Prime Minister Narendra Modi Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.