📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

ప్ర‌పంచానికి భార‌త్ ఆశను క‌ల్పిస్తోంది: ప్రధాని మోడీ

Author Icon By sumalatha chinthakayala
Updated: October 21, 2024 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్డీటీవీ నిర్వ‌హిస్తున్న స‌ద‌స్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న ప్ర‌పంచానికి భార‌త్ ఆశను క‌ల్పిస్తోంద‌ని అన్నారు. భార‌త స‌ర్కారు అసాధార‌ణ రీతిలో ప‌నిచేస్తోంద‌ని, ప్ర‌తి రంగంలోనూ వేగం పెంచిన‌ట్లు ఆయ‌న చెప్పారు. మూడ‌వ సారి తాము అధికారంలోకి రావ‌డం వ‌ల్ల భార‌త వృద్ధి రేటు వేగంగా జ‌రుగుతున్న‌ట్లు అనేక సంస్థ‌లు అంచ‌నా వేశాయ‌న్నారు.

డ‌బుల్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో భార‌త్‌కు అడ్వాంటేజ్ జ‌రుగుతోంద‌ని, ఏఐ టెక్నాల‌జీతో పాటు ఆస్పిరేష‌న‌ల్ ఇండియాగా దేశం మారుతోంద‌న్నారు. దేశ ప్ర‌జ‌లు విక‌సిత్ భార‌త్ గురించి చ‌ర్చిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. జ‌న శ‌క్తితో రాష్ట్ర శ‌క్తి సాధిస్తున్న‌ట్లు ఉంద‌న్నారు. ఊహాజ‌నితంగా సంబంధాల‌ను పెంచుకోబోమ‌ని, త‌మ బంధాల‌న్నీ న‌మ్మ‌కం, విశ్వాసం మీద ఆధార‌ప‌డి ఉంటాయ‌ని ప్ర‌ధాని మోడీ తెలిపారు.

ప్ర‌జాస్వామ్య విలువ‌లు, డిజిట‌ల్ ఇన్నోవేష‌న్‌.. స‌హ‌జీవ‌నం చేయ‌గ‌ల‌వ‌ని భార‌త్ నిరూపించిన‌ట్లు ప్ర‌ధాని చెప్పారు. టెక్నాల‌జీతో స‌మ‌గ్ర‌త సాధించాల‌ని, కానీ దాన్ని నియంత్ర‌ణ‌కు, విభ‌జ‌న‌కు వాడ‌రాద‌న్న ఉద్దేశాన్ని భార‌త్ చూపించిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వానికి రెస్ట్ అనేది లేద‌ని, భార‌త దేశ క‌ల‌ల‌ను నిజం చేసే వ‌ర‌కు విశ్ర‌మించ‌బోమ‌న్నారు.

ఈ కార్యక్రమానికి ముందు ఆయన సదస్సులో పాల్గొనడానికి వచ్చిన విదేశీ అతిథులను కలుసుకొన్నారు. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో యూకే మాజీ ప్రధాని డేవిడ్‌ కామరూన్‌, భూటాన్‌ ప్రధాని దాసో త్సేరింగ్‌ టోబ్గే, విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ తదితరులు పాల్గొననున్నారు.

india NDTV World Summit PM Modi unprecedented scale

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.