📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

71 వేల మందికి నేడు ప్రధాని నియామక పత్రాలు

Author Icon By sumalatha chinthakayala
Updated: December 23, 2024 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సోమవారం నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ మేరకు సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ‘రోజ్‌గార్‌ మేళా’లో భాగంగా 71 వేల మంది యువకులకు మోడీ నియామక పత్రాలను ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రధాని వర్చువల్‌గా పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు.. అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తారు. హోం, తపాలా, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, ఆర్థిక సేవలు తదితర శాఖల్లో 71 వేల ఉద్యోగాలను ఒకే భర్తీ చేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది.

దీనికి సమాంతరంగా ఆత్మనిర్బర్ భారత్ ప్యాకేజ్ కూడా వ్యాపార, ఉద్యోగ అవకాశాలను యువతకు కల్పిస్తోంది. ఈ ప్యాకేజీ కింద పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశల కల్పనకు స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక పథకాలు, కార్యక్రమాలకు ఉద్దీపనలు ప్రకటిస్తుంది. వాటితో పాటు ఉద్యోగాల కల్పనకు ఆత్మనిర్బర్ భారత్ రోజ్‌గార్ యోజన, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు, పీఎం గతిశక్తి, ప్రధాన మంత్రి ముద్ర యోజన, ప్రధాన మంత్రి స్ట్రీట్ వెంటర్ ఆత్మనిర్బర్ నిధి వంటి పలు పథకాలను కేంద్రం తీసుకొచ్చింది. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ, అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్, హౌసింగ్ వంటి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు అదనంగా చేపట్టింది. ఇవన్నీ దేశంలో యువతకు ఉపాధికి ఉద్దేశించినవే.

కాగా, రోజ్‌గార్ మేళా అనేది ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధాన మంత్రి నిబద్దతకు ముందుగుడు. ఇది జాతి నిర్మాణం, స్యయం ఉపాధిలో యువత భాగస్వామ్యానికి అర్ధవంతమైన అవకాశాలను అందిస్తుంది. ఇక, రాష్ట్రస్థాయిల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రోజ్‌గార్ మేళాలను నిర్వహిస్తుంటారు. దేశంలో ఉపాధి కల్పనతో పాటు యువత ఉపాధిని మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశం.

71 thousand people appointment papers PM Modi Rozgar Mela

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.