हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

71 వేల మందికి నేడు ప్రధాని నియామక పత్రాలు

sumalatha chinthakayala
71 వేల మందికి నేడు ప్రధాని నియామక పత్రాలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సోమవారం నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ మేరకు సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ‘రోజ్‌గార్‌ మేళా’లో భాగంగా 71 వేల మంది యువకులకు మోడీ నియామక పత్రాలను ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రధాని వర్చువల్‌గా పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు.. అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తారు. హోం, తపాలా, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, ఆర్థిక సేవలు తదితర శాఖల్లో 71 వేల ఉద్యోగాలను ఒకే భర్తీ చేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది.

దీనికి సమాంతరంగా ఆత్మనిర్బర్ భారత్ ప్యాకేజ్ కూడా వ్యాపార, ఉద్యోగ అవకాశాలను యువతకు కల్పిస్తోంది. ఈ ప్యాకేజీ కింద పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశల కల్పనకు స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక పథకాలు, కార్యక్రమాలకు ఉద్దీపనలు ప్రకటిస్తుంది. వాటితో పాటు ఉద్యోగాల కల్పనకు ఆత్మనిర్బర్ భారత్ రోజ్‌గార్ యోజన, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు, పీఎం గతిశక్తి, ప్రధాన మంత్రి ముద్ర యోజన, ప్రధాన మంత్రి స్ట్రీట్ వెంటర్ ఆత్మనిర్బర్ నిధి వంటి పలు పథకాలను కేంద్రం తీసుకొచ్చింది. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ, అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్, హౌసింగ్ వంటి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు అదనంగా చేపట్టింది. ఇవన్నీ దేశంలో యువతకు ఉపాధికి ఉద్దేశించినవే.

కాగా, రోజ్‌గార్ మేళా అనేది ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధాన మంత్రి నిబద్దతకు ముందుగుడు. ఇది జాతి నిర్మాణం, స్యయం ఉపాధిలో యువత భాగస్వామ్యానికి అర్ధవంతమైన అవకాశాలను అందిస్తుంది. ఇక, రాష్ట్రస్థాయిల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రోజ్‌గార్ మేళాలను నిర్వహిస్తుంటారు. దేశంలో ఉపాధి కల్పనతో పాటు యువత ఉపాధిని మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870