📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Pattabhiram : జగన్ పై విరుచుకుపడ్డ పట్టాభిరామ్

Author Icon By Sudheer
Updated: May 6, 2025 • 10:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యాక్సెస్ రెన్యూవబుల్ ఎనర్జీ ఒప్పందంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఖండించారు. తాము గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే తక్కువ ధరకు ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర ఖజానాకు రూ.2,719 కోట్ల మేర లాభం చేకూర్చినట్లు ఆయన వివరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పట్టాభిరామ్, జగన్ రెడ్డి బుద్ధి ఎలా ఉందో ప్రజలు తెలుసుకోవాలని, వాస్తవాలను గ్రహించాలని వ్యాఖ్యానించారు.

వైసీపీ ప్రభుత్వం యాక్సెస్ సంస్థతో యూనిట్‌కు రూ.5.12

2022 నవంబర్‌లో వైసీపీ ప్రభుత్వం యాక్సెస్ సంస్థతో యూనిట్‌కు రూ.5.12 చొప్పున ఒప్పందం కుదుర్చుకుందని, తాజా టీడీపీ ప్రభుత్వం అదే ఒప్పందాన్ని యూనిట్‌కు రూ.4.60కి తగ్గించి కుదుర్చుకుందని తెలిపారు. ప్రజలపై భారం లేకుండా తాము తీసుకున్న నిర్ణయాన్ని తప్పుగా చిత్రీకరించడం పక్షపాత ధోరణికి నిదర్శనమని పేర్కొన్నారు. జగన్ రెడ్డికి దగ్గరగా ఉన్న వారు ఇప్పుడిప్పుడే జైల్లోకి వెళ్లడం ప్రారంభమైందని, త్వరలో ఆయనకూ అదే పరిస్థితి ఎదురవుతుందని ఎద్దేవా చేశారు.

బ్యాటరీ స్టోరేజ్ బాధ్యత డెవలపర్‌దే

పీపీఏల విషయంలో ఏపీఈఆర్సీ మార్గదర్శకాల ప్రకారం తాము నడుచుకున్నామని, బ్యాటరీ స్టోరేజ్ బాధ్యత డెవలపర్‌దేనని ఎప్పటికైనా స్పష్టంగా ఉంది అని చెప్పారు. గత ప్రభుత్వం పీక్ అవర్స్‌లో యూనిట్‌కు రూ.9.30 నుండి రూ.11.78 వరకు ధర చెల్లించిందని, ఇప్పుడు అదే పని తాము తక్కువ ధరకు చేయడం ప్రజలకు మేలు చేస్తుందని చెప్పారు. చంద్రబాబు ప్రజలపై భారం లేకుండా పాలన చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారని తెలిపారు.

Read Also : గాలి జనార్ధన్ రెడ్డి సహా దోషులందరికీ 7 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన సీబీఐ కోర్టు

Google News in Telugu tdp pattabhi ycp

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.