📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Caste Census : కులగణన అంశంపై ఒవైసీ స్పందన

Author Icon By Sudheer
Updated: April 30, 2025 • 9:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. ఎంతో కాలంగా ఈ డిమాండ్ కొనసాగుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే 2021 నుంచి తాను కులగణన కోసం పాటుపడుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కులగణన ద్వారా వాస్తవిక డేటా లభించి, సామాజిక న్యాయానికి బలమైన ఆధారం లభిస్తుందని ఒవైసీ అన్నారు.

Read Also : Central Government: జనాభా లెక్కింపులో కుల గణనను కూడా చేర్చాలని కేంద్రం నిర్ణయం

భారతదేశ చరిత్రలో మొదటిసారిగా కేంద్రం చొరవ

ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా కేంద్రం చొరవ తీసుకున్న అంశమని పేర్కొన్నారు. కుల గణన అమలుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రులను ఆయన అభినందించారు. అయితే, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా ఇవ్వడంపై బీజేపీ నిరసన తెలపడం తగదని విమర్శించారు. ముస్లిం వర్గాల్లోని వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని ఒవైసీ స్పష్టం చేశారు.

ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం

వెనుకబడిన వర్గాలకు వారి జనాభా నిష్పత్తిలోనే విద్యా మరియు ఉపాధి రంగాల్లో న్యాయమైన వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కులగణన ద్వారానే ఈ వర్గాల అసలు పరిస్థితులు వెలుగులోకి వస్తాయని చెప్పారు. సమగ్రమైన డేటా ఆధారంగా ప్రభుత్వాలు విధానాలు రూపొందించి, సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కులగణనను ఒక రాజకీయ అంశంగా కాకుండా, సమాజ సమతుల్యతకు దోహదపడే అవకాశంగా చూడాలని పిలుపునిచ్చారు.

caste census Google News in Telugu modi Owaisi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.