📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

H1B Visa : హెచ్‌ 1బీ వీసాలపై ఓవైసీ ఫైర్

Author Icon By Sudheer
Updated: September 20, 2025 • 9:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసాల (H1B Visa) ఫీజులను భారీగా పెంచిన నేపథ్యంలో AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నిర్ణయం భారత విదేశాంగ విధానం వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం కేవలం ఘనకార్యాలు, ప్రదర్శనలు, ఆర్భాటపు సభలతో విదేశాంగ విధానం విజయవంతమవుతుందని భావించడం తప్పని అన్నారు. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం భారతీయులపై, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్తున్న వేలాది ఐటీ నిపుణులపై తీవ్రమైన ప్రభావం చూపనుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయులు హెచ్-1బీ వీసాల్లో 71-72 శాతం వాటా పొందుతున్నప్పటికీ, వారి ప్రయోజనాలను రక్షించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.

ఓవైసీ వివరించిన ప్రకారం.. అమెరికాలో భారతీయుల సగటు వార్షిక ఆదాయం సుమారు 1.20 లక్షల డాలర్లు (రూ.1.05 కోట్లు) ఉండగా, భారత్‌కు వచ్చే రిమిటెన్స్‌లో పెద్ద భాగం తెలుగు రాష్ట్రాల నుంచే వస్తోంది. మొత్తం 125 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ ఆదాయంలో 37 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసుల ద్వారానే వస్తోందని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి సందర్భంలో అమెరికా విధానాలు ఈ రెండు రాష్ట్రాల ప్రజల జీవనోపాధిని నేరుగా దెబ్బతీస్తాయని ఆయన అన్నారు. ట్రంప్ కోసం మోదీ గతంలో నిర్వహించిన హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి కార్యక్రమాలను ఓవైసీ ప్రస్తావిస్తూ, ఆర్భాటపు ఈవెంట్లతో దేశ ప్రయోజనాలు కాపాడలేమని మండిపడ్డారు. అమెరికా భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణించడం లేదని, పాకిస్తాన్, సౌదీ అరేబియాతో ఒప్పందాలు చేస్తూ భారత్‌ను ఒంటరిని చేసిందని ఆయన ఆరోపించారు.

ఇక భారత్‌ డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే పరిష్కారమని ఓవైసీ సూచించారు. ఇప్పటికే భారత్ 18 దేశాలతో డీడాలరైజేషన్ ఒప్పందాలు చేసుకున్నప్పటికీ, వాటిని మరింత విస్తరించాలని అన్నారు. ట్రంప్ చేస్తున్న బెదిరింపులకు మోదీ సర్కార్ తలొగ్గకూడదని, దేశ భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కోసం పణంగా పెట్టొద్దని హెచ్చరించారు. 2014 నుంచి 2024 వరకు భారత విదేశాంగ విధానం దారుణంగా వెనకబాటుకుపోయిందని, ఇది ఒక నష్టపోయిన దశాబ్దంగా గుర్తుంచుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. విదేశాంగ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసి, దేశ ప్రజల ప్రయోజనాలను ముందుంచి వ్యవహరించాలని ఓవైసీ హితవు పలికారు.

https://vaartha.com/this-is-her-luck/breaking-news/551241/

Asaduddin Owaisi Donald Trump Google News in Telugu H1B visa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.