తూర్పు కాంగోలో స్మార్ట్ఫోన్ల తయారీలో వాడే అరుదైన ఖనిజం కోసం జరుగుతున్న అన్వేషణ పెను విషాదాన్ని మిగిల్చింది. రుబాయా ప్రాంతంలోని ఒక కోల్టన్ (Coltan) గని ఒక్కసారిగా కుప్పకూలడంతో సుమారు 200 మంది కార్మికులు గనిలోనే సమాధి అయ్యారు. గనిలోనే కలిసిపోయిన 200 ప్రాణాలు ఆఫ్రికా దేశమైన కాంగోలోని రుబాయా ప్రాంతంలో అరుదైన ఖనిజాల వెలికితీత కోసం కార్మికులు భూగర్భంలోకి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల తయారీలో కీలకమైన కోల్టన్ (Coltan) అనే లోహం కోసం గనిలో తవ్వకాలు జరుపుతుండగా, మట్టి పెళ్లలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. లోపల పని చేస్తున్న సుమారు 200 మంది కార్మికులు బయటకు వచ్చే అవకాశం లేక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ భారీ ప్రాణనష్టం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Phone Tapping Case : ఫామ్ హౌస్లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!
భద్రత లేని చోట రెబల్స్ గుత్తాధిపత్యం ఈ గనులు ప్రస్తుతం ప్రభుత్వం చేతుల్లో కాకుండా స్థానిక తిరుగుబాటు దారుల (Rebels) నియంత్రణలో ఉన్నాయి. దీంతో అక్కడ ఎలాంటి కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. ఆధునిక యంత్రాలు లేకుండా, కేవలం చేతులతోనే లోతైన గోతులు తవ్వడం వల్ల గనులు అస్థిరంగా మారుతున్నాయి. లాభార్జనే ధ్యేయంగా రెబల్స్ కార్మికులను మృత్యు గొయ్యిలోకి నెడుతున్నారని మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. భద్రతా ఏర్పాట్లు శూన్యం కావడం, నిరంతర తవ్వకాల వల్ల భూమి బలహీనపడటమే ఈ భారీ విపత్తుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఎలక్ట్రానిక్ వస్తువుల వెనుక రక్తం కూడు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కోల్టన్ వంటి లోహాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. కానీ ఈ విలాసవంతమైన గాడ్జెట్ల వెనుక కాంగో వంటి దేశాల్లోని పేద కార్మికుల రక్తం ఉందనే చేదు నిజం మరోసారి ఈ ఘటనతో బయటపడింది. ఆకలి తీర్చుకోవడం కోసం ప్రాణాలకు తెగించి చీకటి గృహాల్లోకి వెళ్లే కార్మికులకు కనీసం రక్షణ కవచాలు కూడా ఉండవు. ఈ విషాదం నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకుని, అక్రమ మైనింగ్ను అరికట్టాలని మరియు కార్మికుల భద్రతను పర్యవేక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com