📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్‌ను సీజ్ చేసిన అధికారులు

Author Icon By sumalatha chinthakayala
Updated: December 3, 2024 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: కాకినాడ పోర్టులో స్టెల్లాషిప్‌ను అధికారులు సీజ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ తనిఖీల తర్వాత కదిలిన అధికార యంత్రాంగం..కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్ చేసింది. ఈ సందర్భంగా కాకినాడ కలెక్టర్ షన్మోహన్ మాట్లాడుతూ.. షిప్ సీజ్ చేశాం.. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. గోడౌన్ నుంచి షిప్ వరకు బియ్యం ఎలా తరలించారో తేలుస్తామని హెచ్చరించారు.

కాకినాడ పోర్టులోని స్టెల్లా ఎల్ 1 షిప్పులో దొరికిన రేషన్ బియ్యం సంగతి తేల్చేందుకు ఈరోజు ఐదు శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఇందులో పోర్టుతో పాటు రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, కస్టమ్స్‌ అధికారులు ఉన్నట్లు తెలిపారు. రేషన్‌ బియ్యం విషయంలో అధికారుల వైఫల్యం ఉందని, షిప్ సీజ్ చేశామని కలెక్టర్ వెల్లడించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నామని, గోడౌన్ నుంచి షిప్ వరకు బియ్యం ఎలా తరలించారో తేలుస్తామని కలెక్టర్ ప్రకటించారు. కాకినాడ పోర్టులో షిప్పులు తనిఖీ చేసే అధికారం తమకు ఉందని కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం షిప్ పోర్ట్ ఆఫీసర్ కస్టడీ ఉన్నట్లు తెలిపారు.

ఏపీలో కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు రవాణా అవుతున్న వేల టన్నుల బియ్యాన్ని పట్టుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అధికారులకు అడ్డంకులు తప్పడం లేదు. పలు సందర్భాల్లో అధికారులే ఇందుకు సహకరిస్తున్న ఉదాహరణలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా జిల్లా కలెక్టర్ కాకినాడ పోర్టు నుంచి సముద్రంలోకి వెళ్లి పట్టుకున్న దక్షిణాఫ్రికా నౌక స్టెల్లా ఎల్ 1లో దొరికిన రేషన్ బియ్యం వ్యవహారం సంచలనం రేపింది.

Collector Shanmohan Deputy CM Pawan Kalyan Kakinada port Stella ship

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.