📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

బడ్జెట్‌లో బీహార్‌కు పెద్దపీట వేసిన నిర్మలా సీతారామన్

Author Icon By Sukanya
Updated: February 1, 2025 • 4:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్‌లో ఈ ఏడాది నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కేంద్ర బడ్జెట్ 2025లో రాష్ట్రానికి భారీ ప్రాధాన్యం ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘మఖానా బోర్డు’ ఏర్పాటు చేయడంతో పాటు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ స్థాపనకు ప్రతిపాదించారు. బడ్జెట్‌లో భాగంగా, పాట్నా విమానాశ్రయ విస్తరణ, నాలుగు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు, ఒక బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణ ప్రతిపాదనలు వచ్చాయి. తూర్పు భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి బీహార్ కేంద్రంగా మారేలా చర్యలు చేపట్టారు.

మిథిలాంచల్ ప్రాంతంలో పశ్చిమ కోసి కెనాల్ ERM ప్రాజెక్ట్ కోసం 50,000 హెక్టార్ల భూమిని సాగు కోసం అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, రాష్ట్రంలోని IIT విస్తరణ ప్రణాళికలు ప్రకటించారు. ముఖ్యంగా, లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైనందున, నితీష్ కుమార్‌కు చెందిన జెడి(యు), చంద్రబాబు నాయుడు టిడిపితో కలిసి ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది. వారాల తర్వాత, రాష్ట్రంలోని వివిధ రహదారి ప్రాజెక్టులకు 2024 బడ్జెట్‌లో కేంద్రం రూ. 26,000 కోట్లు ప్రకటించడంతో బీహార్‌కు బొనాంజా లభించింది.

కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ, బడ్జెట్‌లో ఇతర రాష్ట్రాలను ఎందుకు విస్మరించారని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ ప్రశ్నించారు. “ఇది బీహార్ ప్రభుత్వ బడ్జెట్‌నా, లేదా భారత ప్రభుత్వ బడ్జెట్‌నా? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో మరేదైనా రాష్ట్రం పేరు విన్నారా?” అంటూ ట్వీట్ చేశాడు. ఎన్డీయేకు మరో మూల స్థంభమైన ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు ఇంత క్రూరంగా విస్మరించారని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్ ప్రశ్నించారు. “ఏడాది తర్వాత అక్కడ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఇది సహజం. అయితే ఎన్‌డిఎ యొక్క ఇతర మూలస్థంభమైన ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు అంత క్రూరంగా విస్మరించారు?” రమేష్ ట్వీట్ చేశారు.

Bihar Budget 2025 Nirmala Sitaraman

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.