📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

టన్నెల్ ప్రమాదంపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్

Author Icon By sumalatha chinthakayala
Updated: February 22, 2025 • 2:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రమాదంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెంటనే స్పందించాలి

హైదరాబాద్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శ్రీ శైలం ఎడమ కాలువ గట్టు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ప్రమాదం ట్వీట్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెంటనే స్పందించాలని పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదం ఎలా జరిగిందో తేల్చాలని కవిత ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు. ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ పై కప్పు కూలిన ఘటనలో కూలీలు గాయపడటం అత్యంత దురదృష్టకరమన్నారు.

దీనికి ఎవరు బాధ్యులు?

కేసీఆర్‌ హయాంలో 10 కి.మీ. మేర టన్నెల్‌ తవ్వారని..ఏనాడూ ఇటువంటి ప్రమాదం జరగలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 4 రోజుల కిందనే పనులు మొదలు పెట్టిందని..అంతలోనే ఈ పెను ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యులని? కవిత అడిగారు. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఈ ఘటనపై స్పందించాల్సిన అవసరముందని డిమాండ్ చేశారు. ఇంకా 9 కి.మీ.లకు పైగా టన్నెల్‌ తవ్వాల్సి ఉందని.. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు.

ఆకస్మాతుగా కూలిన పైకప్పు

కాగా, ఈరోజు ఉదయం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్‌ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి షిఫ్ట్‌లో సుమారు 50 మంది కార్మికులు సొరంగంలోకి వెళ్లారు. ఉదయం 8.30 గంటల సమయంలో కార్మికులు పని చేస్తుండగా.. ఆకస్మాతుగా పైకప్పు కూలి మట్టిపెల్లలు విరిగి పడ్డాయి. దీంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu mlc kavitha Telugu News online tunnel accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.