📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

దివ్యాంగులకు ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగం: మంత్రి సీతక్క

Author Icon By sumalatha chinthakayala
Updated: October 15, 2024 • 5:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రైవేట్ ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే శుభవార్త చెప్పనుంది. వారికి వీలైనంత త్వరగా ప్రైవేటు ఉద్యోగాల కోసం ఆయా సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా జాబ్‌పోర్టల్‌ను అందుబాటులో తెచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో దివ్యాంగుల సంక్షేమశాఖలో కలిసి జాబ్‌పోర్టల్‌ https://pwdjobportal.telangana.gov.in ను మంత్రి ఆవిష్కరించారు.

దీంతో పాటుగా మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టరేట్‌ కాల్‌ సెంటర్‌లో 10 మంది దివ్యాంగులకు నియామకపత్రాలు అందజేశారు. త్వరలోనే దివ్యాంగులకు ఇందిరమ్మ గృహాలు, ఇతర సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల్లో 5 శాతం నిధులు వారి కోసం ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఆలోచిస్తూ వారికి అందించే ఉపకరణాల కోసం రూ.50 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. త్వరలోనే దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి సీతక్క. స్వయం ఉపాధి పథకాలకు చేయూత అందిస్తామన్నారు.

Congress govt disabled people minister seethakka telangana government

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.