📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Rains: అకాల వర్షాలతో..తెలంగాణకు వర్ష సూచన

Author Icon By sumalatha chinthakayala
Updated: March 31, 2025 • 2:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rains: మండుతున్న ఎండలు, ఉక్కపోత వాతావరణం నేపథ్యంలో వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఈ మేరకు మళ్లీ వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. భూ ఉపరితలం వేడెక్కిన ప్రభావంతో ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. రేపు రాత్రి(ఏప్రిల్‌ 1వ తేదీ) నుంచి మూడో తేదీ వరకు వానలు కురుస్తాయని, అయితే 4వ తేదీన వర్ష ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.

ప్రాంతాల్లో ఊరుములు, మెరుపులతో కూడిన వాన

కొన్ని ప్రాంతాల్లో ఊరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశమూ ఉందని హెచ్చరించింది. వర్ష ప్రభావంతో ఏప్రిల్‌ 2, 3 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్,కామారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల్‌, వికారాబాద్‌ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. పలుచోట్ల ఈదురుగాలులు కూడా వీచే వీలుందని పేర్కొంది.

ఏ జిల్లాలో చూసినా అధిక ఉష్ణోగ్రతలు

కాగా, ప్రస్తుతం తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఏ జిల్లాలో చూసినా ఉష్ణోగ్రతలు అధిక మొత్తంలో నమోదు అవుతున్నాయి. ఏప్రిల్, మే నెలలో దంచికొట్టాల్సిన ఎండలు.. మార్చి నెలలో మాడు పగిలేలా చేస్తున్నాయి. ఇలాంటి టైమ్‌ లో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు మోసుకొచ్చింది. తెలంగాణలో ప్రజలు ఎండల నుండి ఉపశమనం పొందేందుకు కొద్ది రోజుల తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Meteorological Department Paper Telugu News Telangana Telangana Rains Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.