ఒడిశాలోని బౌద్ జిల్లాలో యువతలో ఇన్స్టాగ్రామ్ రీల్స్(Instagram Reels)పై పెరిగిన మోజు ప్రాణాలకు మీదకు తెస్తున్నాయి. ఇన్స్టాలో ఫేమస్ కావాలన్న ఆశతో ఒక బాలుడు తన ప్రాణాలతో చెలగాటం ఆడాడు. రైలు వచ్చి వెళ్లే వరకు రైలు పట్టాలపై పడుకుని స్టంట్ చేశాడు. ఈ సాహసోపేతమైన, అత్యంత ప్రమాదకర చర్యను అతని స్నేహితులు వీడియో తీశారు. ఆ వీడియోను బాలుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.
వీడియో వైరల్.. పోలీసులకి సమాచారం
ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టిన కొద్ది సమయానికే వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. వీడియో ఆధారంగా బాలుడిని మరియు అతని స్నేహితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పిల్లల వయసును పరిగణలోకి తీసుకుని పోలీసు శాఖ వారిని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్కు గురిచేసింది.
తల్లిదండ్రులకు, విద్యార్థులకు పోలీసుల హెచ్చరిక
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు తల్లిదండ్రులకు మరియు పాఠశాలల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశారు. చిన్నపిల్లలు సోషల్ మీడియా రీల్స్కు బానిసలు కాకుండా జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ప్రమాదకర చర్యలు ప్రాణాలను పొగొట్టేలా ఉండవచ్చని అధికారుల హెచ్చరిక. యువతను జాగ్రత్తగా, బాధ్యతగా సోషల్ మీడియా వాడుకోవాలని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు ప్రత్యేకంగా మానసిక దృష్టి పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు.
<blockquote class=”twitter-tweet”><p lang=”te” dir=”ltr”>రీల్స్ పై పిచ్చి.. ప్రాణంతో చెలగాటం..<br><br>ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం బాలుడు ప్రమాదకరమైన స్టంట్<br><br>రైలు వచ్చి వెళ్లే వరకూ ట్రాక్ పై పడుకున్న బాలుడు<br><br>ఫ్రెండ్స్ వీడియో తీయగా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బాలుడు<br><br>వీడియో వైరల్ కావడంతో పిల్లలను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు… <a href=”https://t.co/w8MIeCEkOr”>pic.twitter.com/w8MIeCEkOr</a></p>— BIG TV Breaking News (@bigtvtelugu) <a href=”https://twitter.com/bigtvtelugu/status/1941861396234514941?ref_src=twsrc%5Etfw”>July 6, 2025</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>
Read Also : YCP : వైసీపీ నేతలకు బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు