ఆంధ్రప్రదేశ్లో తుఫాను “మొంథా” విపరీతమైన విధ్వంసం సృష్టించినా, ప్రభుత్వ ముందస్తు చర్యల వల్ల ప్రాణనష్టం జరగకపోవడం పెద్ద ఉపశమనం కలిగించింది. సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం, తుఫాన్ ప్రభావంతో రాష్ట్రానికి మొత్తం రూ. 5,265 కోట్ల ఆర్థిక నష్టం సంభవించింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ అంచనాలు ప్రాథమికమైనవని, జిల్లాల వారీగా సమగ్ర నివేదికల తర్వాత తుది అంచనా వెల్లడిస్తామని తెలిపారు. అయితే, ప్రభుత్వం సమయానికి హెచ్చరికలు జారీ చేసి, తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడం వల్ల ప్రాణనష్టం లేకుండా తప్పించగలిగామని సంతోషం వ్యక్తం చేశారు.
Latest News: Ravi Teja: సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను పట్టించుకోను: రవితేజ
ముఖ్యంగా మౌలిక వసతుల రంగం అత్యధికంగా దెబ్బతిందని సీఎం వివరించారు. రోడ్లు, వంతెనలు, డ్రెయినేజీ వ్యవస్థలు దెబ్బతినడంతో రోడ్స్ & బిల్డింగ్స్ (R&B) శాఖకు రూ. 2,079 కోట్ల నష్టం** వాటిల్లిందని చెప్పారు. తీరప్రాంతాల్లో ఆక్వా రంగం తీవ్రంగా దెబ్బతిందని, పంటలు, చెరువులు, ఫీడింగ్ యూనిట్లు పూర్తిగా ముంచుకుపోవడంతో ఆక్వా రంగానికి రూ. 1,270 కోట్ల నష్టం సంభవించిందని తెలిపారు. అలాగే వ్యవసాయ పంటలు తుపాను వర్షాలకు కొట్టుకుపోయి, రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొన్నారని, ఈ రంగానికి రూ. 829 కోట్ల నష్టం కలిగిందని వివరించారు.

చంద్రబాబు నాయుడు ఇంకా పేర్కొంటూ, “నీటిపారుదల శాఖ ముందస్తు చర్యలు తీసుకోవడంతో పెద్దగా నష్టం జరగలేదు. కీలక ప్రాజెక్టులు, ఆనకట్టలు సురక్షితంగా ఉన్నాయ”ని తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని చెప్పారు. వ్యవసాయం, ఆక్వా, విద్యుత్, రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర బృందం రాష్ట్రాన్ని సందర్శించిన తరువాత తుది అంచనాలను సమర్పించి, నష్ట పరిహారం కోసం కేంద్రాన్ని కోరుతామని సీఎం తెలిపారు. “ప్రజల ప్రాణాలను కాపాడగలిగాం అది మా పెద్ద విజయమని” చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/