📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

ఇందిరమ్మ ఇళ్ల తాజా అప్​డేట్

Author Icon By Sudheer
Updated: February 9, 2025 • 1:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం రోజుకో కొత్త సమాచారం అందిస్తోంది. తాజాగా, అందిన దరఖాస్తులను అధికారులు మూడు జాబితాలుగా విభజించారు. వాటిని ఎల్-1, ఎల్-2, ఎల్-3 అని వర్గీకరించారు. ఈ జాబితాల ప్రకారం, మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయనుందని స్పష్టమైన ప్రకటన వచ్చింది.

జాబితా విభజన ఇలా ఉంది: ఎల్-1 జాబితాలో సొంత స్థలంలో గుడిసె, పూరిపాక, మట్టిమిద్దెలు, రేకుల ఇళ్లలో నివాసముంటున్న వారిని చేర్చారు. ఎల్-2 జాబితాలో సొంత స్థలం లేక, పూర్తిగా ఇల్లు లేనివారు ఉన్నారు. ఎల్-3 జాబితాలో ఇప్పటికే ఇల్లు ఉన్నప్పటికీ, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు. మొత్తంగా పరిశీలించిన దరఖాస్తుల ప్రకారం ఎల్-1 జాబితాలో 21.93 లక్షలు, ఎల్-2 జాబితాలో 19.96 లక్షలు, ఎల్-3 జాబితాలో 33.87 లక్షలు ఉన్నారు. మొదటి విడతలో 562 గ్రామాల నుంచి 71,482 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో ఎల్-1 నుంచి 59,807 మంది, ఎల్-2 నుంచి 1,945 మంది, ఎల్-3 నుంచి 5,732 మంది, కొత్త దరఖాస్తుల నుంచి 3,998 మంది ఉన్నారు.

ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా, మొదటి విడతలో ప్రధానంగా సొంత స్థలం ఉన్నవారికే ఇళ్లు మంజూరు చేయనుంది. మిగిలిన ఎల్-1, ఎల్-2 జాబితాలోని లబ్ధిదారులు తర్వాతి విడతల్లో ప్రాధాన్యం పొందనున్నారు. అయితే, ఎల్-3 జాబితాలో 33.87 లక్షల మంది దరఖాస్తుదారులలో చాలా మంది ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులుగా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో లబ్ధిదారుల్లో కొంత నిరాశ వ్యక్తమవుతోంది. ప్రత్యక్షంగా ఇళ్లు అవసరమైన వారు ముందుగా ప్రాధాన్యత పొందడం న్యాయం అయినప్పటికీ, మిగిలిన వారికి కూడా సముచిత న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ప్రకటిస్తుందో చూడాలి.

cm revanth Google news Indiramma Houses Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.