Breaking News – Jubilee Hills Bypoll : ‘KCR కంటే KTR పెద్ద మూర్ఖుడు – బండి సంజయ్

Read Time:  1 min
Breaking News – Jubilee Hills Bypoll : ‘KCR కంటే KTR పెద్ద మూర్ఖుడు – బండి సంజయ్
FONT SIZE
GET APP

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం రోజురోజుకీ రాజకీయ వేడి పెంచుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన దూకుడు ప్రసంగాలతో మరోసారి హైలైట్ అయ్యారు. బోరబండలో జరిగిన ప్రజా సమావేశంలో ఆయన, సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్ కంటే కేటీఆర్ పెద్ద మూర్ఖుడు. తండ్రి సీఎం కావాలని కొడుకుకే ఇష్టం లేదు” అంటూ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని కుటుంబ రాజకీయం నుండి కాపాడాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు.

Breaking News – Bihar : 20 ఏళ్ల తరువాత తొలిసారి అక్కడ పోలింగ్

రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్న బండి సంజయ్, “రేవంత్‌కు నిజంగా దమ్ముంటే గోపీనాథ్ మృతి పై న్యాయ విచారణ చేయించాలి. రోషముంటే కేటీఆర్‌ను జైలుకు పంపించాలి” అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆయన విమర్శించారు. “ఈ రాష్ట్రంలో ఒకప్పుడు ఏనుగులు తినే నాయకులు ఉండేవారు, ఇప్పుడు పీనుగులు పీక్కుతినే నాయకులు వచ్చారు” అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రజా డబ్బు దుర్వినియోగం, అధికార దుర్వినియోగం చేస్తున్న నేతలను ప్రజలే జవాబు చెప్పే సమయం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

Bandi Sanjay: కేటీఆర్ పై సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలు నిజమే : బండి సంజయ్

ఇక తన ప్రసంగంలో బండి సంజయ్ చేసిన “పాకిస్థాన్ రక్తం రేవంత్ ఒంట్లో ప్రవహిస్తోంది” అనే వ్యాఖ్య తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నేతలు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఇది ప్రజాస్వామ్య పరిమితులను దాటిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు బీజేపీ వర్గాలు మాత్రం సంజయ్ వ్యాఖ్యలు రేవంత్‌పై ఉన్న ప్రజా అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయని అంటున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బండి సంజయ్ దూకుడు, ఆయన చేసిన కఠిన వ్యాఖ్యలు ఎన్నికల వేడిని మరింత పెంచాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.