📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

ఉప ఎన్నిక‌లపై కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

Author Icon By sumalatha chinthakayala
Updated: February 11, 2025 • 9:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రజలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతారు

హైదరాబాద్‌: మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉప ఎన్నిక‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు రావ‌డం ఖాయం అని అన్నారు. స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజ‌య్య‌తో పాటు ప‌లువురు నాయ‌కులు ఎర్ర‌వ‌ల్లిలో కేసీఆర్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కీర్తి వెంక‌టేశ్వ‌ర్లు, మ‌ల్కిరెడ్డి రాజేశ్వ‌ర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

వీరికి కేసీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల‌కు తెలంగాణ ప్ర‌జ‌లు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నార‌ని కేసీఆర్ పేర్కొన్నారు. స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో క‌డియం శ్రీహ‌రి ఓడిపోవ‌డం ఖాయ‌మ‌న్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే రాజ‌య్య మ‌ళ్లీ ఎమ్మెల్యేగా గెల‌వ‌డం ఖాయ‌మ‌ని కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు.

కాగా, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఇప్పటికే స్పీకర్‌కు మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో విచారణ కూడా ప్రారంభమైంది. పార్టీ మారిన ఈ ఎమ్మెల్యేల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీ, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిలు ఉన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ తన బలాన్ని తిరిగి పెంపొందించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల ముందు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకోవాలనే అంశంపై కేసీఆర్ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

BRS party by-elections Google news kadiam srihari KCR Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.