Honey trap fraud : హనీట్రాప్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తిరువూరులో మహిళ ఒకరు యువకులను ఫోటోలు చూపించి మాయలో పడేసి డబ్బులు దోచుకుంటున్న వ్యవహారం బయటపడటంతో పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, తంగెళ్లబీడుకు చెందిన కనపర్తి రేణుక అనే మహిళ సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని, ఆకర్షణీయమైన అమ్మాయిల ఫోటోలు చూపిస్తూ బాధితులను ట్రాప్ చేసేది. ఈ క్రమంలో మాధవరావు అనే వ్యక్తిని ఒంటరిగా పిలిపించి అతని వద్ద ఉన్న బంగారు ఉంగరం, రూ.5 వేల నగదు కాజేసినట్లు గుర్తించారు.
Read Also: Delhi: రేపు NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం
అంతటితో ఆగకుండా, అతనిపై అత్యాచారం కేసు పెడతానని బెదిరిస్తూ మరో రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. భయపడిన బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఫిర్యాదు స్వీకరించిన ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ అధికారులు దర్యాప్తు చేపట్టి రేణుకతో పాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి మోసాలకు గురైతే భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: