📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Latest News: Kamareddy : కామారెడ్డిలో దారుణ రోడ్డు ప్రమాదం

Author Icon By Radha
Updated: October 15, 2025 • 4:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని కామారెడ్డి(Kamareddy) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. రాంగ్ రూట్‌లో వచ్చిన టిప్పర్ లారీ, ఎలక్ట్రిక్ స్కూటీని ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.స్థానికుల సమాచారం మేరకు కామారెడ్డి(Kamareddy) నుండి భిక్కనూరు వైపు వెళ్తున్న స్కూటీని ఎదురుగా రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. స్కూటీపై తాత, తల్లి, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలోనే ఆరేళ్ల బాలుడు, తల్లి మృతి చెందగా, తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించిన తాత, చిన్నారుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

Read also: Raila Odinga: కెన్యా మాజీ ప్రధానమంత్రి గుండెపోటుతో మరణం

మృతుల వివరాలు, పోలీసుల విచారణ

మరణించినవారు కిషన్ (53), జస్లిన్ (29), జోయెల్ ప్రకాష్ (4), జోయెల్ జడ్సన్ (5 నెలల శిశువు)గా గుర్తించారు. కిషన్ అదిలాబాద్ జిల్లా వాసి కాగా, జస్లిన్ మరియు ఇద్దరు చిన్నారులు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందినవారని అధికారులు వెల్లడించారు.ఈ దుర్ఘటనపై బిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు రోడ్డుప్రమాదాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Family Tragedy kamareddy latest news Road Accident Telangana news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.