కల్తీ మద్యం కేసులో అరెస్టైన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేశ్ను పోలీసులు విజయవాడకు తరలించారు. శనివారం ఉదయం ఆయనను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ప్రాథమిక విచారణ అనంతరం, పోలీసులు ఆయనను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు. అక్కడ అధికారుల సమక్షంలో పూర్తి వివరాల సేకరణ జరగనుంది. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం ఆయనను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. మొత్తం ప్రక్రియను పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహిస్తున్నారు.
Breaking – News Another Cyclone: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
సిట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జోగి రమేశ్ పేరు ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ ఇచ్చిన వాంగ్మూలంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఆధారాల ఆధారంగా ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. కల్తీ మద్యం తయారీ, సరఫరా, పంపిణీ వ్యవస్థలో జోగి రమేశ్ సన్నిహితులు ప్రమేయం ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆయనను వివరాలు సేకరించేందుకు అధికారాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు, ఇంత పెద్ద రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయడంపై పోలీసులు అధిక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రమేశ్ అరెస్ట్ నేపథ్యంలో ఆయనను విచారించే విధానం, చట్టపరమైన ప్రక్రియలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఇక జోగి రమేశ్ అరెస్ట్తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహం ఉధృతమైంది. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ విజయవాడ, గుంటూరు, బాపట్లలో వైసీపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. పార్టీ నేతలు ఈ చర్యను రాజకీయ కక్షసాధనగా అభివర్ణించారు. “బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోంది” అంటూ నినాదాలు చేశారు. మరోవైపు, పోలీసులు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అదనపు బలగాలను మోహరించారు. మొత్తం మీద, జోగి రమేశ్ అరెస్ట్ కేసు రాజకీయంగా కొత్త చర్చలకు దారితీస్తూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/