📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

ఎమ్మెల్యే పదవిని కాపాడుకునేందుకే అసెంబ్లీకి జగన్ – నిమ్మల విమర్శలు

Author Icon By Sudheer
Updated: April 16, 2025 • 2:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు (ఫిబ్రవరి 24) ప్రారంభం కానున్నాయి. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అసెంబ్లీకి హాజరుకానుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటు విమర్శలు చేశారు. ఇన్నాళ్లు అసెంబ్లీకి రాకుండా జగన్ అజ్ఞాతంలో ఉన్నారని, ఇప్పుడు మాత్రం హాజరవుతున్నారని అన్నారు.

తన పదవి కాపాడుకోవడానికి ప్రయత్నం

జగన్ అసెంబ్లీకి వస్తున్నదంతా ప్రజలపై ప్రేమతో కాదని, ప్రజా సమస్యలపై చర్చించేందుకూ కాదని, తన ఎమ్మెల్యే పదవి పోతుందనే భయంతోనే వస్తున్నారని నిమ్మల ఆరోపించారు. ప్రజలకు ఐదేళ్లు మోసం చేసిన జగన్, చివరకు తన పదవి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన జగన్, ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్నారని, ఇది పూర్తిగా ఆయన స్వార్థ ప్రయోజనాల కోసమేనని నిమ్మల మండిపడ్డారు.

జగన్ ఐదేళ్ల పాలన పూర్తిగా దోపిడీ

జగన్ ఐదేళ్ల పాలన పూర్తిగా దోపిడీ, విధ్వంసాలతో నిండిపోయిందని, అందుకే ప్రజలు ఆయనను తిరస్కరించారని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, అభివృద్ధిని కూనిరాగం పెట్టిన జగన్‌కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంటికి సాగనంపారని వ్యాఖ్యానించారు. ప్రజలు జగన్ వైఖరిని గమనిస్తూ ఉన్నారని, ఇకపై ఆయన మాయలు పనిచేయవని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

AP Assembly Google news Jagan nimmala ramanaidu ycp

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.