📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

జగన్ పచ్చి అబద్దాలు ఆడుతున్నాడు – అచ్చెన్నాయుడు

Author Icon By Sudheer
Updated: February 19, 2025 • 3:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుంటూరు మిర్చి యార్డు వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ సీఎం జగన్ పై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ తన పాలనలో రైతులకు ఒక్క మంచి పని చేయలేదని విమర్శించారు. రైతులకు మేలు చేయని వ్యక్తి, ఇప్పుడు రైతులపైనా అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, “జగన్ తన హయాంలో రైతుల నుంచి ఒక్క గింజ కూడా కొనలేదు. నష్టపోయిన రైతులకు ఏదైనా సహాయం అందించారా? ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఒక్క పైసా ఇచ్చారా?” అని ప్రశ్నించారు. గత పాలనలో డ్రిప్పులు, ఎరువులు, గిట్టుబాటు ధర వంటి ప్రాధాన్యత అంశాలను జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రైతుల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

“మేము అధికారంలోకి వచ్చి ఆరునెలలు కూడా కాకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు. రైతుల కోసం మేము తీసుకొచ్చిన మార్పులను ప్రజలు స్వాగతిస్తున్నారు. అయితే, జగన్ వంటి నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు” అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Acham Naidu Google news Jagan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.