📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నితీష్ రెడ్డి కి వైస్ జగన్ అభినందనలు

Author Icon By Sudheer
Updated: December 28, 2024 • 11:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత యువ క్రికెటర్ నితీశ్ రెడ్డి అద్భుత సెంచరీతో మెరిసిన విషయం తెలిసిందే. ఈ విజయాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నితీశ్‌ను అభినందించారు.

“మెల్బోర్న్ గ్రౌండ్‌లో చిన్న వయసులోనే సెంచరీ సాధించిన నితీశ్ రెడ్డి ఘనత దేశానికి గర్వకారణం. 21 ఏళ్లకే ప్రపంచస్థాయి జట్టుపై ఈ ఘనత సాధించడం నిజంగా ప్రశంసనీయం. నితీశ్ విజయానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను,” అని జగన్ అన్నారు.

నితీశ్‌ బ్యాటింగ్‌ ప్రదర్శన భారత జట్టుకు మాత్రమే కాక, యువ క్రికెటర్లకు కూడా స్ఫూర్తి ఇచ్చేలా ఉందని ఆయన ప్రశంసించారు. విదేశీ గడ్డపై ఈ విధమైన అద్భుత ప్రదర్శన యువతకు ప్రేరణ. నితీశ్ తన కెరీర్‌లో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అని జగన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో నితీశ్ విజయాన్ని సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ప్రశంసించారు. క్రికెట్‌ ప్రేమికులు ఆయనపై అభినందనలు కురిపిస్తూ, ఈ విజయాన్ని దేశం మొత్తం సంబరంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు నితీశ్ విజయాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు.

Jagan Nitish Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.