📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

జగన్, విజయసాయి కొత్త డ్రామా – బుద్దా వెంకన్న

Author Icon By Sudheer
Updated: January 25, 2025 • 1:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పడం జగన్ కు తెలిసే జరిగిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ‘కేసులను పక్కదారి పట్టించేందుకు ఈ డ్రామా. చంద్రబాబుతో విభేదాలు లేవంటే నమ్మేంత పిచ్చోళ్లు కాదు ప్రజలు. చంద్రబాబు కుటుంబాన్ని నువ్వు అన్న మాటలు మర్చిపోను. నిన్ను క్షమించను. మీరు చేసిన భూ కబ్జాలు, దోపిడీల లెక్క తేలాలి. విజయసాయిరెడ్డి దేశం విడిచి వెళ్లడానికి CBI అనుమతి ఇవ్వకూడదు’ అని ట్వీట్ చేశారు.

చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవు అంటే నమ్మెంత పిచ్చోళ్లు కాదు ప్రజలు. తమ నాయకుడిపై అన్న ప్రతి మాట మాకు ఇంకా గుర్తు ఉందని పేర్కొన్నారు. చేసినవి అన్ని చేసి ఈ రోజు రాజీనామా చేసి వెళ్లిపోతా అంటే కుదరని అన్నారు. మీరు చేసిన భూ కబ్జాలు, దోపిడీలు ఉత్తరాంధ్రలో చేసిన అరాచకాలు ప్రతి దానికి లెక్క తేలాలని పేర్కొన్నారు. చంద్రబాబును, వారి కుటుంబాన్ని అన్న మాటు ఎవరూ మరిచిపోయినా నేను మర్చిపోను. నువ్వు పెట్టిన ప్రతి ట్వీట్‌కు నేను ఇచ్చిన సమాధానం గుర్తు ఉంది కదా అంటూ ప్రశ్నించారు.

ఇక విజయసాయి రెడ్డి శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికే నిర్ణయం తీసుకున్నానని అన్నారు. నేను ఏరోజూ అబద్ధాలు చెప్పలేదు. హిందూ ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్పనని వెల్లడించారు.

నాలుగు దశాబ్దాలుగా వైఎస్‌ కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలున్నాయని, వైఎస్‌ కుటుంబంలో మూడు తరాలతో నాకు సంబంధాలున్నాయని స్పష్టం చేశారు. రాజీనామా పూర్తి వ్యక్తిగతమని అన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యుడిగా , పార్టీకి న్యాయం చేయలేనని భావించి రాజీనామా చేశానని వివరించారు. నా స్థానంలో మరొక వ్యక్తి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

buddha venkanna vijayasai reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.