हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

అభివృద్ధిపై చర్చించుకున్నామని వెల్లడి..

Divya Vani M
అభివృద్ధిపై చర్చించుకున్నామని వెల్లడి..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పదిమంది రహస్యంగా సమావేశమైన వార్త శనివారం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ సమావేశానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నాయకత్వం వహించారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంపై ఆయన స్పందించారు. మా సమావేశం వాస్తవమే, కానీ అందులో ఎటువంటి రహస్యం లేదు అని క్లారిఫై చేశారు. రహస్యంగా సమావేశం కావాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.అనిరుధ్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ, తన వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపిస్తే నేను తట్టుకోను అని హెచ్చరించారు. తాజాగా, ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను రెవెన్యూ మంత్రి వద్ద ఏ ఫైలు పెట్టలేదని చెప్పారు.

నాకు పెట్టానని చెప్పిన ఫైల్ గురించి నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవిని అడగాలని అన్నారు.ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధిపై చర్చించడంలో తప్పేముంది అంటూ అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు.అయితే, పార్టీ అధిష్టానానికి చెబుతూ చాలా విషయాలు చెప్పాల్సి ఉంది అని కూడా తెలిపారు. ఆయన ప్రస్తావించిన విషయాలపై త్వరలో పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి దీపాదాస్ మున్షి తో సమావేశమై చర్చించవచ్చని తెలిపారు.

ఇక, ప్రభుత్వ నిధుల కేటాయింపు విషయంలో కొంతమంది ఎమ్మెల్యేలు అన్యాయం ఎదుర్కొంటున్నారని ప్రచారం జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న నియోజకవర్గాలకు మాత్రమే నిధులు వెళ్ళిపోతున్నాయని, తమ నియోజకవర్గాలకు ఏం కేటాయించలేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారంటూ వార్తలు వచ్చాయి.ఈ విషయంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి ఫోన్ చేసి ఈ సమావేశం కేవలం లంచ్ మీటింగ్ మాత్రమేనని ఆయనతో వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870