నంబియో సేఫ్టీ ఇండెక్స్ ఆధారంగా ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ఆండోరా అనే చిన్న దేశం నిలిచింది. ఈ దేశంలో ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య ఉన్న పైరెన్నిస్ దీవుల్లో నెలకొని ఉంది. 2025 ఏడాదికి గానూ ఈ దేశం 84.7 స్కోరుతో టాప్ లో నిలిచింది. ఇక మిడిల్ ఈస్ట్ దేశాల్లో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్ లో అత్యల్ప క్రైమ్ రేటు ఉన్నట్లు తేలింది. ఈ దేశాల్లో సెక్యూరిటీ అధికంగా ఉన్నట్లు నివేదికలో స్పష్టం అయింది. ఈ మేరకు క్రౌడ్ సోర్స్డ్ ఆన్ లైన్ డేటాబేస్ అయిన నంబియో ద్వారా ‘సేఫ్టీ ఇండెక్స్ బై కంట్రీ 2025 మిడ్-ఇయర్’ ఈ నివేదికను ఇచ్చింది.
సేఫెస్ట్ కంట్రీస్ లిస్టులో భారత్ ను పాకిస్థాన్ (Pakistan) దాటేసింది. క్రౌడ్ సోర్స్డ్ ఆన్లైన్ డేటాబేస్ అయిన నంబియో ద్వారా ‘సేఫ్టీ ఇండెక్స్ బై కంట్రీ 2025 మిడ్-ఇయర్’ లిస్టులో భారత్ 66వ స్థానంలో నిలిచింది. 55.7 స్కోరు సాధించింది. యూకే 47 స్థానంలో ఉంది. ఇక అమెరికా 89 వ స్థానాన్ని కైవసం చేసుకుంది. వీటికంటే భారత్ మెరుగైన స్థానంలోనే ఉంది. కానీ భారత్ కంటే మెరుగైన స్థానాల్లో శ్రీలంక (59), పాకిస్థాన్ (65) నిలిచాయి.
నంబియో ఇండెక్స్ 2025 ప్రకారం.. మొత్తం 147 దేశాల్లో భారత్ 66వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ఆండోరా అనే చిన్న దేశం నిలిచింది. ఈ దేశంలో ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య ఉన్న పైరెన్నిస్ దీవుల్లో ఉంది. 2025 ఏడాదికి ఈ దేశం 84.7 స్కోరుతో టాప్ లో నిలిచింది. ఇక మిడిల్ ఈస్ట్ దేశాల్లో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్ లో అత్యల్ప క్రైమ్ రేటు ఉన్నట్లు తేలింది. ఈ దేశాల్లో సెక్యూరిటీ అధికంగా ఉన్నట్లు నివేదికలో స్పష్టం అయింది. ఈ లిస్టు ప్రకారం UAE 85.2 పాయింట్లను నమోదు చేసుకుంది.
Read Also : UPI: పోస్టాఫీసుల్లో యూపీఐ పేమెంట్స్ స్టార్ట్