ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులకు దిగడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు, క్షిపణులను ఉపయోగించి టెహ్రాన్లోని కీలకమైన ఉగ్రవాద పాలన స్థావరాలను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల తీవ్రతకు నగరంలోని పలు భారీ భవనాలు కుప్పకూలిపోగా, ఆకాశమంతటా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
Khamenei Death: మరణం వెనుక పక్కా స్కెచ్: తొలి దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం!
మరోవైపు, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా తన దూకుడును పెంచింది. ఇజ్రాయెల్ మిత్రదేశాలైన అబుదాబి, దుబాయ్, మరియు కువైట్లపై దాడులు చేసేందుకు ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ పరిణామంతో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ సంఘర్షణ కారణంగా ఈ ప్రాంతంలోని రవాణా వ్యవస్థ, చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలు ఈ ఉద్రిక్తతలను ఆందోళనతో గమనిస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :