हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Nara Lokesh : 10 నెలల్లో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు – లోకేశ్

Sudheer
Nara Lokesh : 10 నెలల్లో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు – లోకేశ్

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. గత 10 నెలల్లో రాష్ట్రానికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆర్థిక, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విశాఖపట్నం బీచ్ రోడ్డులో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో కొత్త హోటల్, ఆఫీస్ టవర్ నిర్మాణానికి ఆయన తల్లి నారా భువనేశ్వరి తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.

గత పాలకుల విధ్వంసక విధానం – లోకేశ్ విమర్శలు

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, గత పాలకులు తమ విధ్వంసక విధానాల వల్ల వ్యాపార వాతావరణానికి తీవ్ర నష్టం కలిగించారని లోకేశ్ ఆరోపించారు. పెట్టుబడిదారులను ఆకర్షించాల్సిన సమయంలో, అనేక కంపెనీలను రాష్ట్రం నుండి వెళ్లిపోనిచేశారని వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం పారిశ్రామిక వృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, కొత్త కంపెనీలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తోందని అన్నారు.

Nara Lokesh విద్యా వ్యవస్థలో కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి నారా లోకేశ్

విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి

విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేశ్ వెల్లడించారు. ఈ దిశగా ఇప్పటికే అనేక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, తద్వారా రాబోయే ఐదేళ్లలో 5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితే, ఏపీ ఐటీ రంగంలో అగ్రగామిగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పెట్టుబడులు – అభివృద్ధికి బలమైన అడుగు

ఏపీకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు రాకతో రాష్ట్ర అభివృద్ధికి మంచి అవకాశాలు ఏర్పడ్డాయని లోకేశ్ అభిప్రాయపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం ఉదారంగా విధానాలు అమలు చేస్తోందని, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పెద్ద పెద్ద కంపెనీలు, హోటల్స్, ఐటీ ఫార్మ్స్ ఏర్పడటం వల్ల రాష్ట్రం ఆర్థికంగా మరింత పురోగమిస్తుందని అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870