📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

BJP : బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Author Icon By Sudheer
Updated: July 10, 2025 • 1:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొన్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ (kerala BJP chief Nainar Nagendran) విమర్శలు గుప్పించారు. తాజాగా ఉపాధ్యాయులు తమ హక్కుల కోసం పోరాడేందుకు యత్నించగా వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. “ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన న్యాయమైన డిమాండ్లను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది” అంటూ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

స్టాలిన్‌ హామీలను మరిచారా? – బీజేపీ ప్రశ్న

ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజల పోరాటాలకు మద్దతు ఇచ్చారని గుర్తుచేస్తూ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరించారా? అని నయినార్ నాగేంద్రన్ ప్రశ్నించారు. ముఖ్యంగా 181వ హామీపై నిలదీశారు. ఉద్యోగులు, కార్మికులు, రైతులు, ఉపాధ్యాయులంతా ప్రాథమిక హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు.

డీఎంకేకి గుణపాఠం చెబుతారు – బీజేపీ జోస్యం

డీఎంకే ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారని బీజేపీ (BJP) అంచనా వేసింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని నయినార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. ప్రజల ఆక్రోశాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వానికి నష్టమే తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును అణచివేయాలని చూస్తే, అది ఎప్పుడు తిరుగుబాటుగా మారుతుందో గుర్తుంచుకోవాలని డీఎంకే ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read Also : Drug Racket : హైదరాబాద్ పబ్‌లలో మరోసారి డ్రగ్స్ కలకలం

BJP Google News in Telugu kerala BJP chief Nainar Nagendran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.