हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

BJP : బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Sudheer
BJP : బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొన్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ (kerala BJP chief Nainar Nagendran) విమర్శలు గుప్పించారు. తాజాగా ఉపాధ్యాయులు తమ హక్కుల కోసం పోరాడేందుకు యత్నించగా వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. “ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన న్యాయమైన డిమాండ్లను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది” అంటూ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

స్టాలిన్‌ హామీలను మరిచారా? – బీజేపీ ప్రశ్న

ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజల పోరాటాలకు మద్దతు ఇచ్చారని గుర్తుచేస్తూ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరించారా? అని నయినార్ నాగేంద్రన్ ప్రశ్నించారు. ముఖ్యంగా 181వ హామీపై నిలదీశారు. ఉద్యోగులు, కార్మికులు, రైతులు, ఉపాధ్యాయులంతా ప్రాథమిక హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు.

డీఎంకేకి గుణపాఠం చెబుతారు – బీజేపీ జోస్యం

డీఎంకే ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారని బీజేపీ (BJP) అంచనా వేసింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని నయినార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. ప్రజల ఆక్రోశాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వానికి నష్టమే తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును అణచివేయాలని చూస్తే, అది ఎప్పుడు తిరుగుబాటుగా మారుతుందో గుర్తుంచుకోవాలని డీఎంకే ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read Also : Drug Racket : హైదరాబాద్ పబ్‌లలో మరోసారి డ్రగ్స్ కలకలం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870