రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తనకు హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది. దేశ ఇంధన భద్రత, వినియోగదారుల ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇంధన దిగుమతుల విషయంలో తమ విధానాలు పూర్తిగా దేశీయ అవసరాల మేరకే ఉంటాయని పేర్కొంది. “రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తుందని ప్రధాని మోదీ నాకు హామీ ఇచ్చారు. ఇది వెంటనే జరగకపోయినా, ఆ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుంది” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశం కావడంతో భారత విదేశాంగ శాఖ దీనిపై అధికారికంగా స్పందించింది.
Read Also: Pak-Afghan: పాక్–ఆఫ్ఘాన్ కాల్పుల విరమణ
భారతీయ ప్రజల ప్రయోజనాలే ముఖ్యం: రణధీర్ జైస్వాల్
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, “భారత్ భారీ మొత్తంలో చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో ఒడిదొడుకులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే మా ప్రథమ ప్రాధాన్యత. మా దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్ష్యం ఆధారంగానే ఉంటాయి” అని వివరించారు. “స్థిరమైన ఇంధన ధరలు, సరఫరాల భద్రత అనేవి మా ఇంధన విధానంలోని రెండు ప్రధాన లక్ష్యాలు. దీనికోసం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన వనరులను విస్తృతం చేసుకుంటున్నాం” అని ఆయన తెలిపారు. ఇక అమెరికా విషయానికొస్తే, చాలా ఏళ్లుగా ఆ దేశం నుంచి ఇంధన సేకరణను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని, గత దశాబ్ద కాలంలో ఇది క్రమంగా పెరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు.
మోడీ ఎన్నిసార్లు ప్రధాని అయ్యారు?
2024 భారత సార్వత్రిక ఎన్నికల తర్వాత, మోడీ వరుసగా మూడవసారి ప్రధానమంత్రి అయ్యారు, బిజెపి మెజారిటీని కోల్పోయిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు, మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అలా చేసిన రెండవ వ్యక్తి ఇది.
నరేంద్ర మోడీ భార్య పేరు ఏమిటి?
జసొదా బెన్, నరేంద్ర మోదీ / భార్య
“ప్రధాని నరేంద్ర మోడీ భార్య జశోదాబెన్ గురించి తెలుసుకోవలసిన 10 వాస్తవాలు” . ఇండియా టీవీ . మూలం నుండి 16 జూన్ 2024 న ఆర్కైవు చేసారు . 22 సెప్టెంబర్ 2020న తిరిగి పొందబడింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: