📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

పవన్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందే : అంబటి

Author Icon By sumalatha chinthakayala
Updated: February 24, 2025 • 4:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పవన్ కు కౌంటర్ ఇచ్చిన అంబంటి రాంబాబు

అమరావతి: పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందేనని మాజీ మంత్రి, వైసీపీ నేత సెటైర్లు విసిరారు. జగన్ కు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ రోజు వైసీపీ శాసనసభ్యులు, జగన్ అసెంబ్లీకి హాజరయ్యారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఆందోళన చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అనంతరం వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఈ అంశంపై పవన్ కల్యాణ్ స్పందించారు.

ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు..

అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా తానో లేదా సీఎం చంద్రబాబో ఇచ్చేది కాదన్నారు. ప్రజలే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. ఎక్కువ ఓట్ల శాతం వచ్చిన పార్టీకి ఎక్కువ సేపు మాట్లాడే ఛాన్స్ జర్మనీలోనే ఉంటుందన్నారు. ఆ అవకాశం కావాలంటే జగన్ ఆ దేశానికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. గోవాలో అసెంబ్లీ స్థానాలు కేవలం 40 మాత్రమే ఉంటాయి. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేజిక్ ఫిగర్ 21. గత ఎన్నికల సమయంలో జనసేనకు కూడా 21 సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ డిమాండ్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో కూటమి పార్టీపై వైసీపీ వైసీపీ పై కూటమి పార్టీలో సెటైర్లు వేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైసీపీ నేతలు అసెంబ్లీలోకి అడుగుపెట్టిన 10 నిమిషాలకే బయటకు వచ్చేసారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు అయితే వైసీపీకి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష హోదా రాదు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

Ambati Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu pawan kalayan Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.