📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Mamata Banerjee : నేను బతికున్నంత కాలం టీచర్ల ఉద్యోగాలు కాపాడతా : మమతా బెనర్జీ

Author Icon By sumalatha chinthakayala
Updated: April 7, 2025 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mamata Banerjee : ఇటీవల సుప్రీంకోర్టు పశ్చిమబెంగాల్‌లో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న 25,753 మంది టీచర్లు , ఇతర సిబ్బంది నియామకం చెల్లుబాటు కాదంటూ సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి స్పందించారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు విని శోకంతో తన గుండె బండరాయిగా మారిందని అన్నారు. తాను ప్రాణాలతో ఉన్నంతవరకు అర్హులెవరు తమ ఉద్యోగాలు కోల్పోలేరని హామీ ఇచ్చారు.

నన్ను జైల్లో పెట్టే అవకాశం లేకపోలేదు

ఇటీవల అత్యున్నత న్యాయస్థానం టీచర్ల నియామకం అంశంలో ఇచ్చిన తీర్పు విని నా హృదయం శోక సంద్రమైంది. బండరాయిగా మారింది. ఆ తీర్పు ఆమోదయోగ్యంగా లేదు. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను జైల్లో పెట్టే అవకాశం లేకపోలేదు. ఎవరైనా నాకు సవాల్‌ విసిరితే.. వారికి సమాధానం చెప్పగలను. అర్హులు ఉద్యోగాలు కోల్పోడాన్ని భరించలేను. నేను ప్రాణాలతో ఉన్నంతవరకు వారి ఉద్యోగాలను కాపాడతాను అని టీచర్లతో సమావేశమైన సందర్భంగా దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న 25,753 మంది టీచర్లు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న 25,753 మంది టీచర్లు, సిబ్బంది నియామక ప్రక్రియ యావత్తూ కళంకపూరితంగా, అక్రమాలతో కూడుకొని ఉందని సుప్రీంకోర్టు ఇటీవల అభిప్రాయపడింది. టీచర్లు, ఇతర సిబ్బంది నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు గతేడాది ఏప్రిల్‌లో వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సమర్థించిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో మోసానికి పాల్పడ్డారంటూ ధర్మాసనం పేర్కొంది.

Read Also: భద్రాచలంలో ప్రారంభమైన శ్రీరామ పట్టాభిషేకం

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Mamata Banerjee Paper Telugu News teachers jobs Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news West Bengal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.