Hyderabad metro takeover: HYD మెట్రో సర్కార్ ఆధీనంలోకి, L&Tకు గుడ్‌బై?

Read Time:  1 min
Hyderabad metro takeover
Hyderabad metro takeover
FONT SIZE
GET APP

Hyderabad metro takeover : హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రైవేట్ సంస్థ L&T నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన ఈ నిర్ణయం మెట్రో భవిష్యత్తుకు కొత్త దిశను నిర్దేశించనుంది.

ఈ బదిలీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. వీరు L&T సంస్థతో చర్చలు జరిపి ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.

గత ఏడాది కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం, L&Tకు ప్రభుత్వం సుమారు రూ.2,000 కోట్ల ఈక్విటీని ఒకేసారి చెల్లించనుంది. అదేవిధంగా మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు రూ.13,000 కోట్ల రుణ బాధ్యతలను కూడా ప్రభుత్వం భరించేందుకు సిద్ధమైంది.

Read also: IPS Sunil Kumar Nayak: ఏపీ పోలీసుల తీరుపై పట్నా హైకోర్టు ఫైర్

Hyderabad metro takeover
Hyderabad metro takeover

మెట్రోకు చెందిన ఆస్తులు మరియు వాటి విలువను అంచనా వేయడానికి IDBI క్యాపిటల్ బాధ్యతలు చేపట్టింది. మరోవైపు రైళ్లు, ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థ వంటి సాంకేతిక అంశాలను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ పరిశీలించి ప్రాథమిక నివేదిక సమర్పించింది.

ఈ మార్పుతో మెట్రో విస్తరణ, టికెట్ ధరల నియంత్రణ, సేవల మెరుగుదల వంటి అంశాలపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ లభించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.