Telugu News: Hyderabad-‘వైర్ లెస్’ సిటీగా హైదరాబాద్- సీఎం రేవంత్ సమీక్ష

Read Time:  1 min
Hyderabad
Hyderabad
FONT SIZE
GET APP

విద్యుత్ శాఖపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వమించారు. రాష్ట్రంలో ఎస్పిడిసిఎల్, ఎన్పిడిసిఎల్తో పాటు మరో కొత్త డిస్కం ఏర్పాటు చేయాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించగా దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రణాళికను అధికారులు వివరించారు. వ్యవసాయం, మేజర్, మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటటి సరఫరా, జిహెచ్ఎంసీ పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ వినియోగదాన్ని(Electricity consumption) కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతి పాదనపై చర్చించారు. డిస్కంల పునర్విభజన తర్వాత పిపిఎ అలొకేషన్, సిబ్బంది, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు రేవంత్ రెడ్డి. కేబినెట్ ఆమోదం అనంతరం కొత్త డిస్కం ఏర్పాటుపై ముందుకెళ్లాలని ఆదేశించారు.

గ్రేటర్ హైదరాబాద్ లో పలు ప్రతిపాదనలు

గ్రేటర్ హైదరాబాద్ ల అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ విధానంపై(Cabling method) పలు ప్రతిపాదనలు అధికారులు సీఎంకు వివరించారు. డిసెంబరులోగా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించి, వచ్చే రెండున్నరేళ్లలో కోర్ అర్బన్ రీజియన్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

హైదరాబాద్‌ను ఏ రూపంలో అభివృద్ధి చేస్తున్నారు?
హైదరాబాద్‌ను ఆధునిక సాంకేతికతతో ‘వైర్‌లెస్ సిటీ’గా తీర్చిదిద్దుతున్నారు.

ఈ ప్రాజెక్ట్‌పై ఎవరు సమీక్ష చేశారు?
ముఖ్యమంత్రి రేవంత్ ఈ ప్రాజెక్ట్‌పై సమీక్ష నిర్వహించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/fatal-road-accident-seven-dead/andhra-pradesh/549086/

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.