హైదరాబాద్ మహానగరంలో కల్తీ మాఫియా మరోసారి పంజా విసిరింది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కేవలం లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ నకిలీ పనీర్ దందాను టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఖైరతాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ మరియు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఆకస్మిక దాడులు నిర్వహించి, సుమారు 3,000 కిలోల కల్తీ పనీర్ను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా శ్రీ బాలాజీ డెయిరీ ప్రొడక్ట్స్ (1,600 కిలోలు), విజయ్ మిల్క్ & కర్డ్ షాప్ (1,000 కిలోలు) వంటి దుకాణాల్లో నిల్వ ఉంచిన ఈ పనీర్ను చూసి అధికారులు సైతం విస్తుపోయారు. పాలు, పాల పదార్థాలతో సంబంధం లేకుండా, అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు మరియు నాణ్యత లేని నూనెలను ఉపయోగించి వీటిని తయారు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
Read Also : Godrej Jersey : పెరుగు, పనీర్ వైపు మొగ్గుతున్న జన
ఈ కల్తీ పనీర్ తయారీ వెనుక ఉన్న అసలు నిజాలు సామాన్య ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. సహజసిద్ధమైన పాలను విరగ్గొట్టి పనీర్ తయారు చేసే బదులు, సల్ఫ్యూరిక్ యాసిడ్, యూరియా, మరియు నాసిరకం పామ్ ఆయిల్ను కలిపి కృత్రిమంగా ఈ పనీర్ను సృష్టిస్తున్నారు. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు మరియు దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పండగలు, శుభకార్యాల సమయంలో హోటళ్లు మరియు రెస్టారెంట్లకు తక్కువ ధరకు ఈ కల్తీ పనీర్ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితులపై కఠిన కేసులు నమోదు చేసిన అధికారులు, ఇలాంటి నకిలీ పదార్థాలను గుర్తించేలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :