ఫిబ్రవరి నెల ముగుస్తుండటంతో విద్యార్థులంతా వేసవి సెలవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఏప్రిల్ నెలలో వచ్చే వేసవి సెలవుల కంటే ముందే మార్చి నెలలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు పండుగలు, వారాంతపు సెలవుల రూపంలో భారీగా విరామం లభించనుంది. మార్చి 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై, ఆ తర్వాత మార్చి 4న హోలీ, 14న రెండో శనివారం, 19న తెలుగు నూతన సంవత్సరం ఉగాది, 20న రంజాన్, మరియు 26న శ్రీరామనవమి వంటి వరుస పండుగలు రానున్నాయి. వీటికి ఆదివారాలను కూడా కలిపితే మార్చి నెలలో కనీసం 10 రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకు పరీక్షల ఒత్తిడి నుండి కాస్త ఉపశమనం కలిగించనుంది.
CM Revanth : అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే పార్టీకే నష్టం – రేవంత్
మరోవైపు, ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మార్చి 16వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు (Half-day schools) ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యాశాఖలు ఇప్పటికే దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఏపీలో ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. అలాగే, మార్చి 16వ తేదీ నుండే ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మాత్రం తరగతుల సమయాల్లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. మొత్తానికి మార్చి నెల అటు పరీక్షల సందడితో, ఇటు పండుగల సెలవులతో విద్యార్థులకు ఎంతో కీలకంగా మారనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com