📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

paramilitary : పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు

Author Icon By sumalatha chinthakayala
Updated: April 25, 2025 • 12:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

paramilitary : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. జమ్మూకశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సెలవుపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మరోవైపు శ్రీనగర్ విమానాశ్రయంలో సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇక త్రివిధ బలాలలను ఎక్కడికక్కడ యాక్టివేట్ చర్యలను అధికారులు ప్రారంభించారు. అన్ని వైమానిక స్థావరాలలోనూ యుద్ద విమానాలు కథన రంగంలోకి దిగడానికి సిద్ధం చేస్తున్నారు. ఇక నావికాదళం సముద్రతీర ప్రాంతాలలో భారీ ఎత్తున యుద్ధ నౌకలను మోహరించింది. సరిహద్దులకు వేలాదిమంది సైన్యాన్ని తరలిస్తున్నారు.

ఉగ్రవాదుల ఆచూకీ కోసం వేట

ఉగ్రవాదుల ఆచూకీ కోసం వేట మొదలుపెట్టాయి. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని సమీక్షించడానికి భారత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ కశ్మీర్‌కు చేరుకున్నారు. శ్రీనగర్‌, ఉదమ్‌పూర్‌లో ఆయన పర్యటించనున్నారు. కశ్మీర్‌ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. మరోవైపు ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరగనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీనికి విదేశాంగ శాఖ, జల్ శక్తి ఉన్నతాధికారులు హాజరవుతారని సమాచారం. సింధూ జలాల ఒడంబడిక నిలిపివేత, సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ, పహల్గాం దాడి , పాక్‌ దౌత్యవేత్తలకు సమన్లు వంటి భారత ప్రభుత్వ చర్యల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సైతం నేడు శ్రీనగర్‌లో పర్యటించి.. ఉగ్రదాడిలో గాయపడిన బాధితులను కలవనున్నారు.

Read Also: పాక్‌ను సమర్థించిన అస్సాం ఎమ్మెల్యే అరెస్ట్

Breaking News in Telugu Google news Google News in Telugu Holidays cancelled Latest News in Telugu Paper Telugu News paramilitary forces Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.