📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఆ గ్రామంలో హై అలర్ట్ …అంతుచిక్కని వ్యాదితో 13 మంది మృతి

Author Icon By sumalatha chinthakayala
Updated: March 6, 2025 • 5:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఛత్తీస్ గఢ్: ఛత్తీస్ గఢ్ లో వింత వ్యాధి కలకలం రేపుతోంది.. ఈ అంతుచిక్కని వ్యాధితో ఇప్పటికే 13 మంది మృతి చెందగా 80 మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. మళ్ళీ కరోనా రోజులను గుర్తు చేస్తున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో వింత వ్యాధి వ్యాపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సదరు చిన్న గ్రామంలోని ప్రతి ఇంట్లో ఒక్కరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించామని తెలిపారు అధికారులు.

మరో 80మందికి ఈ వ్యాధి

ఈ వ్యాధితో ఇప్పటికే 13మంది మరణించగా.. మరో 80మందికి ఈ వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు అధికారులు. అనుమానితుల నుండి శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపమని.. రిపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపారు అధికారులు. అంతుచిక్కని వ్యాధి వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో గ్రామస్తులు భయాందోళనకు లోనవుతున్నారు. ఈ వింత వ్యాధి బారిన పడ్డ బాధితులు ఛాతీ నొప్పి, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారని.. ఆరోగ్యం కూడా క్షీణించిందని తెలిపారు అధికారులు.

ఈ మహువా పంట సేకరణ కోసం

మహువా పంట సమయంతో పాటు వాతావరణంలో మార్పు, గ్రామస్తులు అడవుల్లోకి వెళ్లి రోజంతా మహువాను సేకరించటమే వ్యాధికి ప్రధాన కారణమని గ్రామంలో పర్యటిచిన ఆరోగ్య బృందాలు గుర్తిచాయని అన్నారు అధికారులు. వ్యాధితో బాధపడుతున్నప్పటికీ మహువాను సేకరించడానికి అడవులకు వెళ్లాలని బాధితులు పట్టుబడుతున్న క్రమంలో వారికి ఓఆర్ఎస్ ఇచ్చి పంపుతున్నామని తెలిపారు అధికారులు. ఈ మహువా పంట సేకరణ కోసం గ్రామస్థులు రోజు మొత్తం అటవీ ప్రాంతంలోనే ఉంటారని.. అందువల్ల వారు డీహైడ్రేషన్‌కు గురై, అనారోగ్యం బారిన పడుతున్నారని డాక్టర్ కపిల్ దేవ్ కశ్యప్ తెలిపారు.

Breaking News in Telugu Chhattisgarh Dhanikorta Google news Google News in Telugu Latest News in Telugu Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.